రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-01-28T05:39:25+05:30 IST

రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతానికి కృషి చేయాలని నాబార్డ్‌ జిల్లా అభివృద్ధి అధికారి ఎస్‌.శ్రీనివాసరావు కోరారు.

రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతానికి కృషి చేయాలి
మాట్లాడుతున్న శ్రీనివాసరావు

నాబార్డ్‌ జిల్లా అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు

సబ్బవరం, జనవరి 27 : రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతానికి కృషి చేయాలని నాబార్డ్‌ జిల్లా అభివృద్ధి అధికారి ఎస్‌.శ్రీనివాసరావు కోరారు. స్థానిక జాగృతి కార్యాలయంలో గురువారం రైతు ఉత్పత్తిదారుల సంఘాల సీఈవోలు, పాలకవర్గ సభ్యులు, వినియోగదారులకు సామర్థ్యాల పెంపుపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘాలను అనుసంధానం చేసి సుస్థిర దిశగా ఈ సంఘాలను నడిపించాలని, వ్యాపార విస్తరణ చేయడం ద్వారా రైతులకు రెట్టింపు ఆదాయం తేవడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనాథప్రసాద్‌ మాట్లాడుతూ రైతు ఉత్పత్తి దారులకు కావలసిన రుణ సదుపాయాలను బ్యాంకులు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాయ న్నారు. జాగృతి ఎమ్‌డీ కె.సుజాత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఈవో కె.మౌక్తిక, ఉద్యాన శాఖ ఏడీ కె.శైలజ, ఏపీఎంఐపీ ఏపీడీ రహీమ్‌, డీవీఎస్‌ వర్మ, పలువురు సంఘ సభ్యులు, రైతులు, వినియోగదారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-01-28T05:39:25+05:30 IST