రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి : గాంధీ

ABN , First Publish Date - 2020-09-26T09:51:18+05:30 IST

నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ల అధ్యక్షులతో రెవెన్యూ సంబంధిత అంశాలపై ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి : గాంధీ

మియాపూర్‌, సెప్టెంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ల అధ్యక్షులతో రెవెన్యూ సంబంధిత అంశాలపై ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శుక్రవారం మి యాపూర్‌ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో రెవెన్యూ సంబంధిత అంశాలపై వారితో చర్చించారు. రెవెన్యూ, అన్ని ప్రాంతాల సమస్యలపై సమగ్ర సమాచా రం తీసుకుని శనివారం మంత్రి కేటీఆర్‌తో జోనల్‌ కార్యాలయంలో జరిగే వీడియో కాన్ఫ రెన్స్‌లో వివరించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.


అలాగే ఈ ప్రాంత రెవెన్యూ సమస్యలు, జీఓ నెంబర్‌ 58, 59పై, పేద కుటుంబాల సమస్యల పై సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కా రానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌యాదవ్‌, జగదీశ్వర్‌గౌడ్‌, సాయిబాబా, దొడ్ల వెంకటే్‌షగౌడ్‌, హమీద్‌పటే ల్‌, జూపల్లి సత్యనారాయణ, జానకీరామరాజు, లక్ష్మీబాయి, నవతారెడ్డి, పూజిత, సింధూఆదర్శరెడ్డి, పార్టీ డివిజన్ల అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీకాంత్‌, రాజుయాదవ్‌, నార్నె శ్రీనివాస్‌, ఎర్రగుడ్ల శ్రీనివా్‌సయాదవ్‌, రఘునాథ్‌రెడ్డి, గౌతంగౌడ్‌, రాజునాయక్‌, కృష్ణగౌడ్‌ ఉన్నారు. 

Updated Date - 2020-09-26T09:51:18+05:30 IST