సచివాలయాల ద్వారా ఈ-శ్రామిక్‌ నమోదు చేయాలి

ABN , First Publish Date - 2021-10-22T04:57:15+05:30 IST

సచివాలయాల ద్వారా కార్మికులు ఈ-శ్రామిక్‌ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకునేలా అవకాశం కల్పించాలని టీఎన్‌టీయూసీ నాయకులు కడప అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ శ్రీనివాసులుకు విజ్ఞప్తి చేశారు.

సచివాలయాల ద్వారా ఈ-శ్రామిక్‌ నమోదు చేయాలి
అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందిస్తున్న టీఎన్‌టీయుసి నాయకులు

ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 21 : సచివాలయాల ద్వారా కార్మికులు ఈ-శ్రామిక్‌ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకునేలా అవకాశం కల్పించాలని టీఎన్‌టీయూసీ నాయకులు కడప అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ శ్రీనివాసులుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ప్రొద్దుటూరు వచ్చిన ఆయనను టీఎన్‌టీయుసీ నాయకులు స్వయంగా కలిసి వినతిపత్రం అందించారు. యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం ఈ-శ్రామిక్‌ ద్వారా ఆసంఘటిత కార్మికుల పేర్ల నమోదు జరుగుతోందన్నారు. అయితే తరచూ సర్వర్‌ సరిగా పనిచేయక పోవడం వల్ల ఈ-శ్రామిక్‌లో పేర్లు నమోదు కావడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ-శ్రామిక్‌ పేర్ల నమోదు సచివాలయాలకు అప్పగించడం వల్ల కార్మికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ దిశగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో టీఎన్‌టీయుసీ జిల్లా అధ్యక్షుడు కుతుబుద్దీన్‌, బాలమునిరెడ్డి, దాదాపీర్‌, ఏపీజే అబ్దుల్‌ కలాం కార్మిక సంఘం నాయకులు పద్మ వీరన్న, రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T04:57:15+05:30 IST