గిల్గిత్-బాల్టిస్థాన్లో నవంబరు 15న ఎన్నికలు
ABN , First Publish Date - 2020-09-25T07:01:03+05:30 IST
గిల్గిత్-బాల్టిస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను నవంబరు 15న నిర్వహిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది...
ఇస్లామాబాద్, సెప్టెంబరు 24: గిల్గిత్-బాల్టిస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను నవంబరు 15న నిర్వహిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ జారీ చేశారు. అయితే, వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతంలో పాక్ చర్యలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్మూకశ్మీర్, లడఖ్తో సహా గిల్గిత్, బాల్టిస్థాన్ ప్రాంతమంతా తమ భూభాగమేనని పాక్కు భారత్ స్పష్టం చేసింది. గిల్గిత్-బాల్టిస్థాన్లోని 33 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.