విద్యుత్ వినియోగదారులను మోసం చేస్తున్న ఘనుడు
ABN , First Publish Date - 2020-07-17T11:19:50+05:30 IST
విద్యుత్ బిల్లులు చెల్లించే క్రమంలో వినియోగదారులను మోసం చేస్తున్న ఘనుడి బండారం బయటపడిందని విద్యుత్శాఖ ఎస్ఈ ..
ఒంగోలు(క్రైం), జూలై 16 : విద్యుత్ బిల్లులు చెల్లించే క్రమంలో వినియోగదారులను మోసం చేస్తున్న ఘనుడి బండారం బయటపడిందని విద్యుత్శాఖ ఎస్ఈ ఎన్.శివప్రసాదరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పి.రాంబాబు అనే వ్యక్తి నగరంలో సమతానగర్ వద్ద పే నియర్బై అనే పేరుతో ఒక దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. కరెంటు బిల్లులు చెల్లించేందుకు వినియోగదారులు వెళితే రశీదుకు బదులుగా ఆన్లైన్లో డిమాండ్ నోటీసులు ఇచ్చి వారి వద్ద డబ్బు తీసుకుని మోసం చేస్తున్నాడని, తమ విచారణలో తేలిందన్నారు. వినియోగదారులు విద్యుత్శాఖ రెవెన్యూ కార్యాలయాల వద్ద లేదా స్వయంగా ఆన్లైన్లోనే బిల్లులు చెల్లించాలని కోరారు. సమస్యలుంటే 1912 నెంబరుకు ఫోన్ చేయాలని కోరారు.