విద్యుత్‌ మీటర్ల నిర్ణయం విరమించుకోవాలి

ABN , First Publish Date - 2021-10-17T05:33:43+05:30 IST

వ్యవసాయ బోర్లకు విద్యుత్‌ మీటర్ల బిగింపు నిర్ణయాన్ని విరమించుకోవాలని టీడీపీ మండలాధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ మీటర్ల నిర్ణయం విరమించుకోవాలి
విద్యుత్‌ సిబ్బందికి వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు


పుల్లలచెరువు, అక్టోబరు 16: వ్యవసాయ బోర్లకు విద్యుత్‌ మీటర్ల బిగింపు నిర్ణయాన్ని విరమించుకోవాలని టీడీపీ మండలాధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్‌  డిమాండ్‌ చేశారు. శనివారం మండలంలోని ఉమ్మడివరం, ముటుకుల గ్రామంలో పెంచిన కరెంట్‌ చార్జీలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించి గ్రామ తీర్మానం చేశారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ట్రూఆప్‌ చార్జీల పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. అనధికార కరెంట్‌ కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలు వీడకుంటే ఉద్యమం తప్పదన్నారు.  కార్యక్రమంలో మండల టీడీపీ ఉపాధ్యక్షుడు రామిరెడ్డి, పుల్లలచెరువు పట్టణ ప్రధాన కార్యదర్శి వేముల వీరయ్య, టీడీపీ గ్రామ నాయకులు నరసింహారావు, జి వెంకటేశ్వర్లు, సొమయ్య, చిన్న వెంకటయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-17T05:33:43+05:30 IST