చెక్డ్యామ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
ABN , First Publish Date - 2020-05-28T10:49:42+05:30 IST
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు
సారంగాపూర్, మే 27 : వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని బీరవెల్లి, గొడిసెర గ్రామ సమీపంలో గల స్వర్ణ వాగుపై రూ.4 కోట్ల నిధులతో నిర్మాణం చేపట్టే చెక్ డ్యామ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మీ, జిల్లా రైతు సమన్వయ కోఆర్డినేట ర్ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్ రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.