కరోనా అనుమానితుల తరలింపు
ABN , First Publish Date - 2020-05-27T10:34:48+05:30 IST
మండలంలో ముంబై, చెన్నై వలస కార్మికులతో కరోనా పాజిటివ్ కేసులు పెరుగు తున్నాయి.
జన్నారం, మే 26 : మండలంలో ముంబై, చెన్నై వలస కార్మికులతో కరోనా పాజిటివ్ కేసులు పెరుగు తున్నాయి. ఈ నేపథ్యంలో వారి ప్రైమరీ కాంటాక్ట్లను ఐసోలేషన్కు తరలిస్తున్నారు. కిష్టాపూర్లో ఒకే కుటుం బం నుంచి నలుగురికి, రోటిగూడలో ముగ్గురికి, కవ్వా ల్లో ఒకరికి పాజిటివ్ వచ్చింది. రోటిగూడలో పాజి టివ్ వచ్చిన వారితో ఉన్న 11 మందిని బెల్లంపల్లి ఐసోలేషన్కు తరలించారు.
హోం క్వారంటైన్లో వారికి నిత్యావసరాలు
బొమ్మెన గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు ఇటీవల హైదరాబాద్ నుంచి రావడంతో గ్రామస్థులు వారిని గ్రామంలోకి రానీయలేదు. ఊరికి దగ్గర్లో ఒక పాక వేసి హోం క్వారంటైన్ చేశారు. వారికి నిత్యావసర వస్తువులు లేవని తెలుసుకున్న తహసీల్దార్ రాజ్కుమా ర్ బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు.
హోంక్వారంటైన్లో 3,311 మంది- క్వారంటైన్లో 28, ఐసోలేషన్లో 17 మంది
మంచిర్యాల అర్బన్ : జిల్లాలో హోం క్వారంటైన్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మంగ ళవారం నాటికి 3,311కు హోంక్వారంటైన్లో ఉన్నారు. జిల్లాలో 27 పాజిటివ్ కేసులు ఉండగా, 28 మంది క్వారంటైన్లో, మరో 17 మంది బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి 158 నమూనాలను పంపగా 113 నెగెటివ్గా వచ్చాయి. 27 మంది ముంబై వలస కార్మికులకు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాజాగా 17 మంది రక్త నమూనాలను హైదరాబాద్ పంపిం చగా ఫలితాలు రావాల్సి ఉందని జిల్లా కరోనా వ్యాధి పర్యవేక్షకుడు డా. బాలాజీ విడుదల చేసిన బులె టిన్లో పేర్కొన్నారు.