రామమందిర నిర్మాణానికి ప్రతి హిందువూ భాగస్వామ్యం కావాలి

ABN , First Publish Date - 2021-01-18T05:27:39+05:30 IST

అయోధ్యలోని రామమందిర ని ర్మాణానికి ప్రతి హిందువూ భాగస్వామ్యం కావాలని నిధి సమర్పణ అభియాన్‌ జిల్లా ప్రముఖ్‌ నిమ్మకాయల లక్ష్మీనా రాయణ రెడ్డి అన్నారు.

రామమందిర నిర్మాణానికి ప్రతి హిందువూ భాగస్వామ్యం కావాలి
కమలాపురంలో శోభయాత్ర నిర్వహిస్తున్న రామసేవకులు

కమలాపురం, జనవరి 17: అయోధ్యలోని రామమందిర ని ర్మాణానికి ప్రతి హిందువూ భాగస్వామ్యం కావాలని నిధి సమర్పణ అభియాన్‌ జిల్లా ప్రముఖ్‌ నిమ్మకాయల లక్ష్మీనా రాయణ రెడ్డి అన్నారు. రామ మందిర నిర్మా ణానికి సమర్పణ అభియాన్‌ కార్యక్రమం నిర్వహి స్తున్నట్లు ఆయన తెలి పారు. ఆదివారం కమలాపురం పట్ట ణంలో పెద్ద ఎత్తున రామసే వకులు శోభ యాత్ర నిర్వహిం చారు. పట్టణంలోని ఆర్యవైశ్య రామాలయం నుంచి కడప- తా డిపత్రి రహదారి అడ్డరోడ్డు వర కు యాత్ర సాగింది. అనంతరం లక్ష్మీనారాయణరెడ్డి మా ట్లాడు తూ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 31 వరకు రామ సేవకుల నిధి సమర్పణకు ప్రతి ఇంటి వద్దకు రామ సేవకులు వస్తార న్నారు. ప్రతి హిందువు భాగ స్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా మన్నారు. అయోధ్యలో ఇటీవల జరిగిన భూమిపూజ, అనంతరం జరుగుతున్న కార్యక్రమాలను వివరించారు. నిధి సమర్పణ చేసి రామకార్యంలో పునీ తుల వుదాం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రముఖ్‌ శ్రీనివాసులు, నిధి ప్రముఖ్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-18T05:27:39+05:30 IST