ప్రతీ పోలీసు అధికారి బాధ్యతాయుతంగా మెలగాలి

ABN , First Publish Date - 2020-02-28T10:58:25+05:30 IST

ప్రతీ ఒక్క పోలీస్‌ అధికారి బాధ్యతాయుతంగా మెలగాల ని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి గురువారం జిల్లా పోలీస్‌

ప్రతీ పోలీసు అధికారి బాధ్యతాయుతంగా మెలగాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 27: ప్రతీ ఒక్క పోలీస్‌ అధికారి బాధ్యతాయుతంగా మెలగాల ని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి గురువారం జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఒకరు చేసి న చిన్నచిన్న తప్పిదాల వల్ల రాష్ట్ర పోలీస్‌శాఖ మొత్తానికి వేలెత్తి చూపించే పరిస్థితి వస్తుంద న్నారు. ప్రతీ ఒక్క పోలీస్‌ అధికారి బాధ్యతా యుతంగా మెలగాల్సిన అవసరం ఉందన్నారు.


తాను చేయాల్సిన విధుల పట్ల పూర్తి బాధ్యతగా ఉండి ప్రజలను దృష్టిలో పెట్టుకొని పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతీ ఒక్క అధికారి ఈ  బాధ్యతను తీసుకరావా లంటే ప్రతీరోజు పోలీస్‌స్టేషన్‌ మొదలుకొని అన్ని పోలీస్‌ కార్యాలయాల్లో కూడా బ్రెయిన్‌ స్టార్మింగ్‌ సెషన్స్‌ నిర్వహిస్తూ ప్రజలందరి కోసం మనం పని చేస్తున్నామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాల్సి ఉందన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారితో పాటు ప్రతీ ఒక్కరు కూడా వారి వారి కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్‌లో హాజర య్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శేత్వారెడ్డి, అడిషనల్‌ ఎస్పీ అన్యోన్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-28T10:58:25+05:30 IST