ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN , First Publish Date - 2020-05-11T10:30:49+05:30 IST

ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని కలెక్టర్‌ శశాంక అన్నారు.

ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

మంత్రి కేటీఆర్‌ పిలుపుతో నీటి నిల్వలను తొలగించిన నాయకులు, అధికారులు  



కరీంనగర్‌ టౌన్‌/కరీంనగర్‌ రూరల్‌, మే 10: ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని కలెక్టర్‌ శశాంక అన్నారు.  ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ప్రతి ఒక్కరు డ్రై డే పాటించాలని రాష్ట్ర మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపు ఇచ్చారు. ఈ మేరకు మేరకు కరీంనగర్‌లో కలెక్టర్‌ కె.శశాంక, మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ వల్లూరి క్రాంతి, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌ తదితరులు స్వచ్ఛత పాటించారు.


59వ డివిజన్‌లోని జ్యోతినగర్‌లో మేయర్‌ వై.సునీల్‌రావు, కమిషనర్‌ వల్లూరి క్రాంతి స్వచ్చత కార్యక్రమాన్ని ప్రారంభించి డివిజన్‌లో పర్యటించారు. కార్పొరేటర్‌ గందె మాధవితో కలిసి వ్యాధులపై అవగాహన కోసం రూపొందించిన వాల్‌పోస్టర్లను అతికించారు. డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణిహరిశంకర్‌   ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా డివిజన్‌లో పర్యటించి నీటి నిల్వలను తొలగించారు. కేటీఆర్‌ ఆదేశాలకు స్పందించిన కొత్తపల్లి మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ బండ రాధాగోపాల్‌రెడ్డి నీరునిల్వ ఉన్న ప్రదేశాలు, పరిసరాలను శుభ్రం చేశారు. 

Updated Date - 2020-05-11T10:30:49+05:30 IST