క్రీడలపట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తిని పెంచుకోవాలి

ABN , First Publish Date - 2022-01-24T04:56:43+05:30 IST

విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని లింగాల మండల వైఎస్సార్‌ క్రాంతి పదం అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ ఆంజనేయులు పేర్కొన్నారు.

క్రీడలపట్ల  ప్రతి ఒక్కరూ ఆసక్తిని పెంచుకోవాలి

పులివెందుల, జనవరి 23: విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని లింగాల మండల వైఎస్సార్‌ క్రాంతి పదం అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ ఆంజనేయులు పేర్కొన్నారు. మండలంలోని నల్లపురెడ్డిపల్లె జడ్పీ హైస్కూల్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన సాఫ్ట్‌బాల్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, షటిల్‌ కడ్డీ తదితర క్రీడలను ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ మానసిక ఉల్లాసం, శారీరక ఎదుగుదలకు క్రీడలు దోహదపడతాయని, యువత క్రీడల వైపు ఆసక్తి కనబరచాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీలు వెంకటరమణారెడ్డి, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T04:56:43+05:30 IST