లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించండి: దేవ్‌బంద్‌

ABN , First Publish Date - 2020-04-09T08:20:42+05:30 IST

ముస్లింలంతా షరియాకు కట్టుబడి నడుచుకుంటూ లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ‘దారుల్‌ ఉలూమ్‌ దేవ్‌బంద్‌’ పిలుపునిచ్చింది. ఈనెల 8,9 తేదీల్లో షబే బరాత్‌ సందర్భంగా మసీదులు...

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించండి: దేవ్‌బంద్‌

లఖ్‌నవూ, ఏప్రిల్‌ 8: ముస్లింలంతా షరియాకు కట్టుబడి నడుచుకుంటూ లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ‘దారుల్‌ ఉలూమ్‌ దేవ్‌బంద్‌’ పిలుపునిచ్చింది. ఈనెల 8,9 తేదీల్లో షబే బరాత్‌ సందర్భంగా మసీదులు, శ్మశానవాటికలకు వెళ్లరాదని సూచించింది. కరోనా విపత్తును ఎదుర్కోవడానికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని కోరింది. ఈమేరకు పిలుపునిస్తూ ‘దారుల్‌ ఉలూమ్‌ దేవ్‌బంద్‌’కు చెందిన మొహ్తమిన్‌ మౌలానా అబుల్‌ ఖాసింనోమానీ ముస్లింలకు ఓ బహిరంగ లేఖ రాశారు. 


Updated Date - 2020-04-09T08:20:42+05:30 IST