స్థానికులనే ఎన్నుకోండి
ABN , First Publish Date - 2021-03-03T06:28:04+05:30 IST
స్థానికులనే ఎన్నుకోండి
ఉయ్యూరు, మార్చి 2 : నగర పంచాయతీ ఎన్నికల్లో ఉయ్యూ రుకు చెందిన టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటు వేసి విజయం చేకూ ర్చాలని టీడీపీ నాయకులు అన్నారు. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన కౌన్సిలర్ అభ్య ర్థుల, నాయకుల, కార్యకర్తల సమావేశంలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయ ణరావు, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థిగా స్థానికేతరుని ఎమ్మెల్యే కేపీ సారథి ప్రతిపాదిం చారని, ఉయ్యూరుకు చెందిన వారు చైర్మన్ పదవికి అర్హులు కాదా, వైసీపీలో స్థానికులు ఆపదవికి అర్హులు కాదా అని ప్రశ్నించారు. స్థానికులు, స్థానికేతరుల గురించి అవగాహన కలిగించి టీడీపీ అభ్యర్థులకే ఓట్లు వేయాలని ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఎమ్మెల్యే, ఆ పార్టీకు చెందిన చైర్మన్ అభ్యర్థి ఇద్దరు స్థానికేతరులేనని స్థానికులకే అవకాశం ఇవ్వాలని కోరారు.
చైర్మన్ అభ్యర్థిగా కూనపరెడ్డి వాసు
నగర పంచాయతీ ఎన్నికల టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా కూన పరెడ్డి శ్రీనివాసరావు(వాసు)ను పోటీలో ఉన్న కౌన్సిలర్ అభ్యర్థులు ఏకగ్రీ వంగా ఆమోదించగా నాయకులు ఆయన పేరును ప్రకటించారు. కౌన్సిల్కు టీడీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపిస్తే స్థానికుడైన శ్రీని వాసరావు చైర్మన్గా ఉయ్యూరును అభివృద్ధి పథంలో నిలుపుతా రన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. గొట్టిపాటి రామ కృష్ణప్రసాద్, వీరంకి గురుమూర్తి, వీరపనేని శివ రామ్, భీమవరపు పిచ్చిరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు గుర్నాధరావు, మాజీ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, కిరణ్ పాల్గొన్నారు.