రాజీవ్ గృహకల్ప ప్లాట్ల పరిశీలన
ABN , First Publish Date - 2022-01-31T04:33:22+05:30 IST
పట్టణ సమీపం నదీఅగ్రహారం రోడ్డులో ఉన్న రాజీవ్ గృహకల్ప ఇళ్ల స్థలాలను ఆదివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీహర్ష పరిశీలించారు.
గద్వాల టౌన్, జనవరి 30 : పట్టణ సమీపం నదీఅగ్రహారం రోడ్డులో ఉన్న రాజీవ్ గృహకల్ప ఇళ్ల స్థలాలను ఆదివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీహర్ష పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో రాజీవ్ గృహకల్ప పేరున ప్రభుత్వమే ప్లాట్లను ఏర్పాటు చేసి, విభిన్న ఆదాయ వర్గాల వారికి వాయిదా పద్ధతిలో ప్లాట్ల కొనుగోలుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజీవ్ గృహకల్ప ప్లాట్లను గుర్తించి వాటిని బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు నిర్ణ యం తీసుకున్న నేపథ్యంలో స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ప్లాట్ల విక్రయాల విధివిధానాలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. వివరాలను రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్కు వివరించా రు. వారి వెంట మునిసిపల్ చైర్మన్ బీ.ఎస్. కేశవ్, వైస్ చైర్మన్ బాబర్, మునిసిపల్ క మిషనర్ జానకీరామ్ సాగర్, గట్టు ఎంపీపీ విజయ్ ఉన్నారు.