ఉత్సాహంగా సాగిన పరుగు పందెం పోటీలు
ABN , First Publish Date - 2021-10-24T04:57:07+05:30 IST
స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూలు మైదానంలో 400 మీటర్ల పరుగు పందెం పోటీలు ఉత్సాహంగా సాగాయి.
ప్రొద్దుటూరు టౌన్, అక్టోబరు 23: స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూలు మైదానంలో 400 మీటర్ల పరుగు పందెం పోటీలు ఉత్సాహంగా సాగాయి. శనివారం భాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా వంద మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 14, 16, 18, 20 సంవత్సరాలలోపు బాలబాలికలకు పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. 30వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూలు మైదానంలో జిల్లాస్థాయి 1500 మీటర్ల పరుగుపందెం పోటీలు నిర్వహిస్తామని బాషా అథ్లెటిక్ ఫౌండేషన్ కార్యదర్శి అహమర్బాష తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయలు శివారెడి ్డ, అల్లాబకాష్, సాయిప్రసాద్, ఖాదర్రెడ్డి, శివప్రసాద్, నాయక్, తదితరులు పాల్గొన్నారు.