మాజీ పోలీసు కమిషనర్కు భారీ జరిమానా!
ABN , First Publish Date - 2021-08-20T00:54:01+05:30 IST
న్యాయవిచారణకు హాజరుకాని ముంబై మాజీ పోలీసు కమిషన్ పరమ్ బీర్ సింగ్కు జస్టిస్ ఉత్తమ్చంద్ చాందీవాల్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ రూ. 25 వేల భారీ జరిమానా విధించింది.
ముంబై: న్యాయవిచారణకు హాజరుకాని ముంబై మాజీ పోలీసు కమిషనర్కు పరమ్బీర్ సింగ్కు జస్టిస్ ఉత్తమ్చంద్ చాందీవాల్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ రూ. 25 వేల భారీ జరిమానా విధించింది. ఓ అవినీతి కేసుకు సంబంధించి బుధవారం తమ ముందు హాజరవ్వాలంటూ కమిషన్ గతంలో పరమ్బీర్ సింగ్కు సమన్లు జారీ చేసింది. అయితే.. పరమ్బీర్ సింగ్ మాత్రం కమిషన్ ముందు హాజరుకాలేదు. దీంతో..కమిషన్ ఆయనపై రూ. 25 వేల జరిమానా విధించింది. అవినీతికి పాల్పడ్డారంటూ మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్పై పరమ్ బీర్ సింగ్ గతంలో సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు ప్రభుత్వం.. మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య దర్యాప్తు కమిషన్ను ఏర్పాటు చేసింది.