ఫేస్బుక్, ట్విటర్లకు ‘పార్లమెంటరీ’ సమన్లు
ABN , First Publish Date - 2021-01-18T07:21:40+05:30 IST
ఫేస్బుక్, ట్విటర్లకు ‘పార్లమెంటరీ’ సమన్లు
న్యూఢిల్లీ, జనవరి 17: సామాజిక మాధ్యమాల్లో సమాచార భద్రత గురించి చర్చించేందుకు గాను ఈ నెల 21న సమావేశానికి హాజరుకావాలని సూచిస్తూ ఫేస్బుక్, ట్విటర్లకు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. పౌరుల హక్కుల రక్షణ, సోషల్ మీడియా దుర్వినియోగం, నెట్టింట మహిళల భద్రత తదితర విషయాల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ప్రధానంగా వాట్సాప్ ప్రైవసీ పాలసీ గురించే చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.