ప్రభుత్వ సంస్థల ప్రవేటీకరణపై ఆందోళన

ABN , First Publish Date - 2021-11-27T04:26:35+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలనునిరసిస్తూ శుక్రవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో ఆందోళన చేపట్టారు.

ప్రభుత్వ సంస్థల ప్రవేటీకరణపై ఆందోళన
ఉదయగిరిలో ఆందోళన చేస్తున్న రైతు సంఘం నాయకులు

ఉదయగిరి రూరల్‌, నవంబరు 26: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలనునిరసిస్తూ శుక్రవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు కాకు వెంకటయ్య మాట్లాడుతూ రైతు ఉద్యమం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ సంస్థల ప్రవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. రైతు ఉద్యమంలో పాల్గొన్న రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ విజయమ్మ, నాయకులు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, కామాక్షమ్మ, కృష్ణ, సురేష్‌, మధు, వెంకటేశ్వర్లు, పెంచలరాజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-27T04:26:35+05:30 IST