అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-11-26T05:50:20+05:30 IST
నిర్మల్ జిల్లా ముథోల్ మండలం విట్టోలి తాండకు చెందిన పవర్ భోజరాం(53)అనే రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై అశోక్ తెలి పారు.
ముథోల్, నవంబరు 25 : నిర్మల్ జిల్లా ముథోల్ మండలం విట్టోలి తాండకు చెందిన పవర్ భోజరాం(53)అనే రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై అశోక్ తెలి పారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మృతు డు తన ఒకటిన్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తిపంట వేశాడు. గత మూడు సంవత్సరాల నుండి ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. సుమారు నాలుగు లక్షల వరకు అప్పులున్నాయి, దిగుబడులు రాక చేసిన అప్పులు తీర్చలేక మంగళవారం రాత్రి తన ఇంట్లో పురుగుల మందు తాగాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం 108 లో భైంసాకు తరలిస్తుండగా దారిలోనే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై లెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.