రైతన్నలు రాజులాగా ఉండాలి
ABN , First Publish Date - 2022-06-22T06:56:29+05:30 IST
రైతన్నలు రాజులాగా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ విజయలక్ష్మి రాంకిషన్రెడ్డి అన్నారు.
మామడ, జూన్ 21 : రైతన్నలు రాజులాగా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ విజయలక్ష్మి రాంకిషన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సంఘ భవన నిర్మాణానికి ఐదు లక్షల నిధులను మం జూరు చేశారని, మరో రెండున్నర లక్షలు జడ్పీ నిధులను కేటాయిస్తామ న్నారు. గ్రామంలోని ఉన్నత, ప్రాథమిక, అంగన్వాడి కేంద్రాలను జడ్పీ చైర్మన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. సర్పంచ్ భూమేశ్వర్, వైస్ ఎంపీపీ లింగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ హరీష్ కుమా ర్, ఎంపీడీవో మల్లేశం, నాయకులు గంగారెడ్డి, శేఖర్, చంద్రశేఖర్గౌడ్, నవీన్ రావు, మనోహర్, శ్రీనివాస్, శేఖర్, ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.