విద్యుదాఘాతంతో తండ్రీకొడుకుల దుర్మరణం

ABN , First Publish Date - 2021-02-26T14:13:58+05:30 IST

అరక్కోణం సమీపంలో విద్యుదాఘాతంతో తండ్రీకొడుకులు మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. తిరువళ్లూర్‌ జిల్లా రామలింగాపురంకు చెందిన భాగ్యరాజ్...

విద్యుదాఘాతంతో తండ్రీకొడుకుల దుర్మరణం

చెన్నై/వేలూరు (ఆంధ్రజ్యోతి): అరక్కోణం సమీపంలో విద్యుదాఘాతంతో తండ్రీకొడుకులు మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. తిరువళ్లూర్‌ జిల్లా రామలింగాపురంకు చెందిన భాగ్యరాజ్‌ (37) మిఠాయి దుకాణం నడుపుతున్నాడు. అతని కుమారుడు అరుణ్‌కుమార్‌ (14) అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. బంధువులను పరామర్శించేందుకు తండ్రీకొడుకులు స్కూటర్‌పై రాణిపేట జిల్లా అరక్కోణంకు వచ్చారు. వీరు గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణం కాగా, కోవాలం వద్ద మూత్రవిసర్జన కోసం రోడ్డు పక్కనే స్కూటర్‌ ఆపి సమీపంలోని పొలం ప్రాంతానికి వెళ్లారు. పొలం చుట్టూ వేసిన విద్యుత్‌ కంచెను గమనించని వీరు కంచెకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై సంఘటనాస్థలంలోనే మృతిచెందారు. ఈ ఘటనపై అరక్కోణం పోలీసులు కేసు నమోదు చేసి, అనుమతి లేకుండా విద్యుత్‌ కంచె ఏర్పాటు చేసిన వారి కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-02-26T14:13:58+05:30 IST