బ్యాంకాక్లో హోటల్ బంద్ అయ్యిందని భర్తతో ఉండనంటున్న భార్య!
ABN , First Publish Date - 2020-09-05T14:15:21+05:30 IST
యూపీలోని మీరట్ మెడికల్ పోలీస్ స్టేషన్కు వచ్చిన ఒక మహిళ తన భర్తపై విచిత్రమైన ఆరోపణతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మామ బ్యాంకాక్లో హోటల్ నిర్వహిస్తున్నారని, లాక్ డౌన్ కారణంగా హోటల్...
మీరట్: యూపీలోని మీరట్ మెడికల్ పోలీస్ స్టేషన్కు వచ్చిన ఒక మహిళ తన భర్తపై విచిత్రమైన ఆరోపణతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మామ బ్యాంకాక్లో హోటల్ నిర్వహిస్తున్నారని, లాక్ డౌన్ కారణంగా హోటల్ మూతపడిందని తెలిపింది. దీంతో మామకు వచ్చే ఆదాయం తగ్గపోయిందని, తరువాత మామ బ్యాంకాక్లో ఎటువంటి వ్యాపారం నిర్వహించకుండా, తిరిగి మీరట్ వచ్చారని తెలిపింది.
ఇక్కడికి వచ్చాక మామ అనారోగ్యం పాలయ్యారని, దీంతో ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఆరోపించింది. ఇటువంటి పరిస్థితుల్లో భర్త కూడా ఉద్యోగం చేయడం లేదని, పైగా రోజూ మద్యం తాగుతున్నాడని, అందుకే తాను భర్తతో పాటు ఉండాలనుకోవడం లేదని తెలిపింది. ఈ ఉదంతంపై పోలీసు అధికారి కుల్వీర్ సింగ్ మాట్లాడుతూ బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.