మాస్కు లేకుంటే జరిమానే..!

ABN , First Publish Date - 2021-12-04T05:42:10+05:30 IST

కొవిడ్‌ మూడో దశ భయం నేపథ్యంలో విధిగా మాస్కు వాడా లని ప్రభుత్యం చర్యలు చేపట్టింది. దీనిలో భాగ ంగా పోలీసుశాఖ వాహనదారులకు ఈ-చలానా లు విధిస్తోంది. అంతేకాదు పాదచారులకు కూ డా ఈ-చలానాలు వేసేందుకు చర్యలు తీసు కుంటున్నారు.

మాస్కు లేకుంటే జరిమానే..!
అవగాహన కల్పిస్తున్న పోలీసులు

ఈ-చలానాలు వేస్తున్న పోలీసులు

నేటి నుంచి ప్రత్యేక  చర్యలు


ఒంగోలు(క్రైం) డిసెంబరు 3: కొవిడ్‌ మూడో దశ భయం నేపథ్యంలో విధిగా మాస్కు వాడా లని ప్రభుత్యం చర్యలు చేపట్టింది. దీనిలో భాగ ంగా పోలీసుశాఖ వాహనదారులకు ఈ-చలానా లు విధిస్తోంది. అంతేకాదు పాదచారులకు కూ డా ఈ-చలానాలు వేసేందుకు చర్యలు తీసు కుంటున్నారు. కొవిడ్‌ వ్యాప్తి తగ్గించడంతో పా టుగా స్వీయరక్షణ కోసం కూడా మాస్కు అ త్యవసరం. ఈ నేపథ్యంలో మాస్కులు లేకుండా బయట తిరుగుతున్న వారికి జరిమానాలు విధిం చాలన్న కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు పోలీసులు ప్ర త్యేక చర్యలు చేపట్టారు. మాస్కులు లేకుండా వా హనచోదన చేసేవారికి రూ.100 జరిమానాతో పా టుగా మరో రూ.15 సర్వీస్‌ చార్జీ కింద వసూలు చేస్తున్నారు. మొత్తంగా మాస్కు లేకుండా బ యిట తిరిగితే మెసేజ్‌ రూపంలో ఈ-చలానా ఇంటికి వస్తుంది. కాగా ఒంగోలు నగరంలో మాస్కు లేకుండా వాహ నాలపై తిరుగుతున్న వారికి ట్రాఫ్రిక్‌ పోలీసులు అవగాహన కల్పించడంతో పాటుగా ఫొటోలు తీ సి జరిమానాలు విధిస్తున్నారు. వాహనం రిజి స్ట్రేషన్‌ నంబరు ఆధారంగా సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ పంపిస్తున్నారు. ఈ మేరకు నగరంలో ట్రాఫిక్‌ డీ ఎస్పీ మల్లికార్జునరావు వాహనదారులకు అవ గాహన కల్పిస్తున్నారు. శనివారం నుంచి జరిమా నాలను విధిస్తామని అంటున్నారు. ఇప్పటికే ట్రా ఫిక్‌ పోలీసులతో పాటుగా అన్ని స్టేషన్‌ల పరిధి లో ఈ-చలానాలు వేసేందుకు చర్యలు చేపట్టిన ట్లు తెలిపారు.  


Updated Date - 2021-12-04T05:42:10+05:30 IST