ఎన్సీబీ కార్యాలయం ఉన్న ముంబై ఎక్స్ఛేంజ్ భవంతిలో మంటలు
ABN , First Publish Date - 2020-09-21T21:59:20+05:30 IST
ముంబై ఎక్స్ఛేంజ్ బిల్డింగ్లో సోమవారంనాడు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ భవంతిలో ..
ముంబై: ముంబై ఎక్స్ఛేంజ్ బిల్డింగ్లో సోమవారంనాడు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ భవంతిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కార్యాలయం కూడా ఉంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో మాదకద్రవ్యాల కోణం నుంచి ఎన్సీబీ దర్యాప్తు చేస్తోంది.
ముంబై ఎక్స్ఛేంజ్ బిల్డింగ్లోని రెండో అంతస్తులో మంటలు చెలరేగగా, ఎన్సీబీ కార్యాలయం మూడో ఫ్లోర్లో ఉంది. ప్రమాద వార్త తెలియగానే అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి. ప్రమాదానికి కారణం కానీ, ఎవరైనా గాయపడ్డారా అనేది కానీ వెంటనే తెలియరాలేదు.