అయ్యవారుపల్లెలో మొదటి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-07-02T11:03:42+05:30 IST
బి.కోడూరు మండల పరిధిలోని అయ్యవారుపల్లెలో మొదటిసారిగి ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
బద్వేలు, జూలై 1 : బి.కోడూరు మండల పరిధిలోని అయ్యవారుపల్లెలో మొదటిసారిగి ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు అప్రమత్తమై గ్రామమంతా బ్లీచింగ్ పౌడరు చల్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. బుధవారం వారి కుటుంబ సభ్యులను 14 మందిని క్వారంటైన్కు తీసుకెళ్లినట్లు వైద్యాధికారి వర్ధన్రెడ్డి తెలిపారు. గ్రామాన్ని ఎంపీడీవో విశ్వేశ్వర్రావు, తహశీల్దారు మధురవాణి, వైద్యాధికారులు పరిశీలించారు.