సకాలంలో సమస్యలు పరిష్కరించండి
ABN , First Publish Date - 2021-01-21T06:25:49+05:30 IST
గ్రామ సచివాలయాలకు వస్తున్న వినతులను సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ జె.వెంకటరావు ఆదేశించారు.
గంట్యాడ, జనవరి 20: గ్రామ సచివాలయాలకు వస్తున్న వినతులను సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ జె.వెంకటరావు ఆదేశించారు. మండలంలోని వసంత, లక్కిడాం గ్రామ సచివాలయాలను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు చక్కని సేవలు అందజేయడం కోసం ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను అమల్లోకి తీసుకుని వచ్చిందన్నారు. దీనిని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. ఆయనతో పాటు ఎంపీడీవో నిర్మాలాదేవి ఉన్నారు.