వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి

ABN , First Publish Date - 2021-06-22T05:40:07+05:30 IST

వానాకాలం పంటల సాగులో వ్యవసాయాధికారుల ఇచ్చిన సలహాలు, సూచనలు పాటిస్తే పంట దిగుబడి సాధించవచ్చని ఏడీఏ వాజిద్‌హుస్సేన్‌ అన్నారు.

వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి

జక్రాన్‌పల్లి, జూన్‌21: వానాకాలం పంటల సాగులో వ్యవసాయాధికారుల ఇచ్చిన సలహాలు, సూచనలు పాటిస్తే పంట దిగుబడి సాధించవచ్చని ఏడీఏ వాజిద్‌హుస్సేన్‌ అన్నారు. మండలంలోని లక్ష్మాపూర్‌ గ్రామంలో వానాకాలం పంటల సాగుపై సోమవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్‌బీ వాడకం వల్ల ఎరువుల ఖర్చు తగ్గడమే గాకుండా నేల సారవంతమవుతుందని, కాలుష్యం ఏర్పడదని తెలిపారు. పంట కూడా దిగుబడి వస్తుందని రైతులకు అవగాహన కల్పించారు. పచ్చిరొట్ట, జీలుగ, జనుము ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. రైతులు విత్తనోత్పత్తి పథకం కింద వరి విత్తనాలు తీసుకొని తామే స్వయంగా విత్తనాలను ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ పథకం కింద  రైతులకు పెసర్ల విత్తనాలను పంపిణీ చేశారు. డీఎస్‌బీ వాడకంపై డ్రైవ్‌ సిడింగ్‌ వరిపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కైలాస్‌నాయక్‌, రూరల్‌ ఏడీఏ వెంకటలక్ష్మీ, వ్యవసా యాధికారి  దేవిక, ఎఈవోలు బాస్కర్‌, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T05:40:07+05:30 IST