క్వారంటైన్‌ హౌస్‌లో నలుగురు

ABN , First Publish Date - 2020-03-30T09:17:25+05:30 IST

విదేశాల నుంచి వచ్చిన నలుగురు వివిధ ప్రాంతాల్లోని క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్నట్టు పాలకొల్లు రూరల్‌

క్వారంటైన్‌ హౌస్‌లో నలుగురు

పాలకొల్లు రూరల్‌, మార్చి 29 : విదేశాల నుంచి వచ్చిన నలుగురు వివిధ ప్రాంతాల్లోని క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్నట్టు పాలకొల్లు రూరల్‌ ఎస్‌ఐ పి.అప్పారావు ఆదివారం తెలిపారు. కరోనా ఎఫెక్ట్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధించడంతో విదేశాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నలుగురిని గుర్తించామన్నారు. ఆ వ్యక్తుల ఆచూకీ తెలియకపో వడంతో లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారులు పాలకొల్లు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు జరపగా ఆ నలుగురు వివిధ ప్రాంతాల్లోని క్వారంటైన్‌ హౌసెస్‌లో ఉన్నారన్నారు.

Updated Date - 2020-03-30T09:17:25+05:30 IST