భారత్ నుంచి వచ్చిన కార్గో షిప్లో 14 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-05-05T15:20:01+05:30 IST
భారతదేశం నుంచి డర్బన్కు ప్రయాణించిన కార్గో షిప్లోని 14మంది సిబ్బందికి పరీక్షలు చేయగా కొవిడ్ పాజిటివ్ అని వచ్చినట్లు...
జోహన్నెస్బర్గ్ (దక్షిణాఫ్రికా): భారతదేశం నుంచి డర్బన్కు ప్రయాణించిన కార్గో షిప్లోని 14మంది సిబ్బందికి పరీక్షలు చేయగా కొవిడ్ పాజిటివ్ అని వచ్చినట్లు దక్షిణాఫ్రికాకు చెందిన ట్రాన్స్నెట్ నేషనల్ పోర్ట్ అథారిటీ తెలిపింది.కాగా సరుకుల రవాణా ఓడలో ఉన్న ఒక చీఫ్ ఇంజినీరు కరోనాతో కాకుండా గుండెపోటుతో మరణించారని ట్రాన్స్నెట్ ప్రతినిధి చెప్పారు. సరుకులతో కూడిన ఓడలో సిబ్బందికి వైద్యపరీక్షలు చేయగా వారిలో 14 మందికి పాజిటివ్ అని రావడంతో వారిని క్వారంటైన్ లో ఉంచారు. కరోనా రోగులున్న కార్గో నౌకను దిగ్బంధంలో ఉంచామని, ఈ ఓడలోకి వెళ్లడానికి ఎవరికీ ప్రవేశం లేదని ట్రాన్స్నెట్ ప్రతినిధి చెప్పారు.
ఈ నౌకలో 200 మంది పోర్టు ఉద్యోగులు 3వేల టన్నుల బియ్యాన్ని ఆఫ్ లోడ్ చేశారని ఓ పోర్టు అధికారి చెప్పారు. బియ్యం ఆఫ్ లోడింగ్ చేసిన కూలీలు తమకు కరోనా సోకుతుందేమోనని భయపడుతున్నారు. ఫిలిప్పీన్స్ సిబ్బంది ఉన్న కార్గో నౌక డర్బన్ నౌకాశ్రయానికి చేరిన తర్వాత సిబ్బందికి కరోనా ఉందని తేలింది.