బెంగాల్ నుంచి రాజ్యసభకు ఏచూరి
ABN , First Publish Date - 2020-02-28T09:42:56+05:30 IST
పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయడానికి తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేరును ఆ రాష్ట్ర సీపీఎం ప్రతిపాదించింది. ఇందుకు కాంగ్రెస్ మద్దతును
కోల్కతా, ఫిబ్రవరి 27: పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయడానికి తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేరును ఆ రాష్ట్ర సీపీఎం ప్రతిపాదించింది. ఇందుకు కాంగ్రెస్ మద్దతును తీసుకోనుంది. ఈ విషయాలపై సీపీఎం పొలిట్బ్యూరో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మార్చి 26న పశ్చిమ బెంగాల్లో ఐదు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.