గౌతమ్ గంభీర్ దొడ్డ మనసు ఇదీ.....

ABN , First Publish Date - 2021-05-01T22:46:23+05:30 IST

బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కరోనా సమయంలో తన ఉదారతను చాటుకున్నారు. కోవిడ్ దృష్ట్యా 200

గౌతమ్ గంభీర్ దొడ్డ మనసు ఇదీ.....

న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కరోనా సమయంలో తన ఉదారతను చాటుకున్నారు. కోవిడ్ దృష్ట్యా 200 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌ను ఆర్డర్ చేశారు. వాటిని ఉచితంగానే ప్రజలకు పంచనున్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉచిత పంపిణీ ఆదివారం నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించారు. అవసరమైన వారు డాక్టర్ ఇచ్చే ప్రిస్కిప్షన్‌తో పాటు రోగి ఆక్సిజన్ లెవెల్స్‌ను సూచించే పూర్తి వివరాలను చూపించి, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను తీసుకెళ్లచ్చని గంభీర్ సూచించారు. అంతేకాకుండా ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారు తగిన ఆధారాలను కూడా సమర్పించాలని సూచించారు. మిగితా వారు సెక్యూరిటీ నిమిత్తం పోస్ట్ డేటెడ్ చెక్కులను ఇవ్వాలని గంభీర్ సూచించారు. 


Updated Date - 2021-05-01T22:46:23+05:30 IST