గవర సామాజికవర్గాన్ని బీసీ-ఏలో చేర్చాలి
ABN , First Publish Date - 2021-10-22T06:30:55+05:30 IST
వెనుకబడిన గవర సామాజికవర్గాన్ని బీసీ-ఏలోకి మార్పు చేయాలని గవర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ కోరారు.
కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్
అనకాపల్లి టౌన్, అక్టోబరు 21: వెనుకబడిన గవర సామాజికవర్గాన్ని బీసీ-ఏలోకి మార్పు చేయాలని గవర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ కోరారు. ఈ మేరకు గురువారం జరిగిన సమావేశంలో కార్పొరేషన్ కార్యవర్గం తీర్మానం చేసినట్టు చెప్పారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 29న విశాఖ వస్తున్న బీసీ కమిషన్కు కార్పొరేషన్ చేసిన తీర్మానం లేఖను ఎంపీ డాక్టర్ సత్యవతి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు చేతుల మీదుగా అందజేస్తామన్నారు. అలాగే విశాఖ కేంద్రంగా గవర జాతీయులకు ఎకరా స్థలం కేటాయించాలని, అనకాపల్లిలో 50 సెంట్లు స్థలం మంజూరు చేయించాలని తీర్మానంలో కోరామన్నారు. సమావేశంలో డైరెక్టర్లు ఆడారి రుక్ష్మిణి, మొల్లేటి సరస్వతి, సూరిశెట్టి సుబ్బలక్ష్మి, శిలపరశెట్టి బాబి, బొడ్డేడ సూర్యనారాయణ, కొణతాల ఉమాదేవి, కె.వెంకటనరసింహం, మారిశెట్టి గంగాభాయి, దాడి జగన్నాథరావు, దాడి అప్పారావు పాల్గొన్నారు.