ప్లాట్ఫామ్ టికెట్తోనే రైలు ఎక్కొచ్చు
ABN , First Publish Date - 2021-06-17T08:36:57+05:30 IST
ప్లాట్ఫామ్ టికెట్తోనే ఇక రైల్లో ప్రయాణించడానికి ప్యాసింజర్లకు భారతీయ రైల్వే అవకాశం కల్పించింది. గమ్యస్థానానికి
ట్రైన్లోనే టీటీఈ దగ్గర టికెట్ తీసుకోవచ్చు
అత్యవసర ప్రయాణాలకు వీలుగా కొత్త రూల్
26 ప్రత్యేక రైళ్ల కొనసాగింపు.. 2 పునరుద్ధరణ
న్యూఢిల్లీ, జూన్ 16 : ప్లాట్ఫామ్ టికెట్తోనే ఇక రైల్లో ప్రయాణించడానికి ప్యాసింజర్లకు భారతీయ రైల్వే అవకాశం కల్పించింది. గమ్యస్థానానికి ఎంత టికెట్టో ఆ ధరను మాత్రం ప్రయాణంలో చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా జారీచేసిన నిబంధనల మేరకు... ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు నేరుగా ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) దగ్గరకు వెళ్లి తమకు ఎక్కడికి టికెట్ కావాలో చెప్పాల్సి ఉంటుంది. దాని ప్రకారం టీటీఈ టికెట్ జారీ చేస్తారు.