ఘనంగా భీష్మ ఏకాదశి

ABN , First Publish Date - 2021-02-24T04:40:52+05:30 IST

మండల కేంద్రంలో మంగళవారం మం డల గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో భీష్మ ఏకదశిని ఘనంగా నిర్వహించారు.

ఘనంగా భీష్మ ఏకాదశి
భీష్ముని చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహిస్తున్న జడ్పీచైర్మన్‌

నవీపేట, ఫిబ్రవరి 23 : మండల కేంద్రంలో మంగళవారం మం డల గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో భీష్మ ఏకదశిని ఘనంగా నిర్వహించారు. ఓ భీష్మకారుని చిత్రపటానికి జడ్పీచైర్మన్‌ దాద న్న గారి విఠల్‌రావు క్షీరాభిషేకం చేశారు. అనంతరం గంగపుత్రుల సం ఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో నవీ పేట సర్పంచ్‌ ఏటీఎస్‌ శ్రీనివాస్‌, అబ్బాపూర్‌ ఎం సర్పంచ్‌ ఎస్‌. శ్రీనివాస్‌, నాయకులు మానికేశ్వర్‌రావు, బుచ్చన్న, శేఖర్‌రెడ్డి, పృథ్వీరాజ్‌, మనో హర్‌రావు, గంగపుత్ర సంఘం సభ్యులు పోశెట్టి, నారాయణ, భూ మయ్య, పెద్దన్న, సాయిలు, పాల్గొన్నారు. 

ధర్మారం(బీ)లో..

డిచ్‌పల్లి: భీష్మఏకాదశి పురష్కరించుకొని మండలంలోని ధర్మా రం(బీ) వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ నిర్వాహకులు శ్రీదే వి, భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా అ లంకరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - 2021-02-24T04:40:52+05:30 IST