ఘనంగా సద్గురు క్షీరలింగేశ్వరస్వామి రథోత్సవం

ABN , First Publish Date - 2022-01-15T05:06:47+05:30 IST

మండల కేంద్రంలో వెలసిన సద్గురు క్షీరలింగేశ్వరస్వామి రథోత్సవం శుక్రవారం కన్నులపండువగా జరిగింది.

ఘనంగా సద్గురు క్షీరలింగేశ్వరస్వామి రథోత్సవం
రథాన్ని లాగుతున్న భక్తులు


కృష్ణా, జనవరి 14 : మండల కేంద్రంలో వెలసిన సద్గురు క్షీరలింగేశ్వరస్వామి రథోత్సవం శుక్రవారం కన్నులపండువగా జరిగింది. ఈశ్వరస్వామి పూజారులు శుక్రవారం తెల్లవారు జామున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథ కలశానికి పూజలు చేయగా, భక్తులు రథాన్ని లాగారు. కార్యక్రమంలో కమరి మఠం కమిటీ సభ్యులు వెంకణగౌడ, ఉదయ్‌కుమార్‌, నీలకంఠాయ, సిద్దప్పగౌడ, స్థానిక సర్పంచ్‌ లు రాధ, సావిత్రి, రేణుకా, సర్పంచుల సంఘం జిల్లా ఉపా ధ్యక్షుడు శివప్ప, లక్ష్మినారాయణగౌడ్‌, ఇడిగి శంకరమ్మ, ఎం పీపీ పూర్ణిమ, ఎంపీటీసీలు రామచంద్ర, శారద, కోఆప్షన్‌ స భ్యుడు అబ్దుల్‌ఖాదర్‌, నాయకులు శివరాజ్‌పాటిల్‌, విజయ్‌ కుమార్‌గౌడ, కేఎస్‌.పాటిల్‌, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి మో నేష, రమేష్‌, మహదేవ, శివశంకర్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.


 ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

జాతర సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి క్షీరలింగేశ్వర మహాస్వాముల పూజలు చేశా రు. అనంతరం జ్ఞాన మందిరంలో డాక్టర్‌ వృషబాలింగేశ్వర మహాస్వాములను దర్శించుకున్నారు. మహాస్వాములు ఎమ్మె ల్యే చిట్టెంను శాలువా, పూలమాలలు వేసి సన్మానించారు. 

Updated Date - 2022-01-15T05:06:47+05:30 IST