GHMC ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-11-23T16:55:21+05:30 IST

నగరంలోని జీహెచ్ఎంసీ ప్రధాక కార్యాలయంల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

GHMC ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: నగరంలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం జీహెచ్ఎంసీ ముట్టడికి బీజేపీ కార్పొరేటర్లు యత్నించారు. మేయర్ ఛాంబర్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 5 నెలల క్రితం వర్చువల్ మీటింగ్ పెట్టినా... అప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. సాధారణ సమావేశం పెట్టి, ప్రజా సమస్యలను పరిష్కరించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2021-11-23T16:55:21+05:30 IST