పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న కౌంటింగ్ సిబ్బంది

ABN , First Publish Date - 2020-12-04T12:43:45+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది.

పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న కౌంటింగ్ సిబ్బంది

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. సికింద్రాబాద్ ఏవీ కాలేజ్‌లో ముషీరాబాద్ సర్కిల్ డివిజన్ల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఒక్కొక్కరుగా సిబ్బంది, ఏజెంట్లు కౌంటింగ్ హాల్‌కు చేరుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సిబ్బంది  హాల్‌లోకి వెళ్తున్నారు. ఆరు డివిజన్ల కౌంటింగ్ కొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. 


అటు సరూర్ నగర్ సర్కిల్ పరిధిలోని ఐదు డివిజన్లకు కౌంటింగ్ జరుగనుంది. 19వ వార్డు- సరూర్ నగర్ డివిజన్, 20వ వార్డు-ఆర్.కె.పురం డివిజన్ , 21వ వార్డు-కొత్తపేట డివిజన్, 22వ వార్డు - చైతన్యపురి డివిజన్, 23వ వార్డు - గడ్డిఅన్నారం డివిజన్‌లకు సంబంధించిన ఓట్లను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో లెక్కించనున్నారు.


అలాగే  ఎల్బీ నగర్ సర్కిల్-4 పరిధిలోని  నాలుగు డివిజన్లు 15వ వార్డు-వనస్థలిపురం  16వ వార్డు-హస్తినాపురం, 17వ వార్డు-చంపాపేట,  18వ వార్డు-లింగోజిగూడ డివిజన్‌లకు సంబంధించిన ఓట్లను సరూర్ నగర్ వీఎం హోమ్‌లో లెక్కింపు జరుగనుంది. 


Updated Date - 2020-12-04T12:43:45+05:30 IST