కాసేపట్లో జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-04T12:36:44+05:30 IST
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభంకానుంది.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దకు కౌంటింగ్ సిబ్బంది చేరుకుంటున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తి చేస్తారు. అనంతరం బ్యాలెట్ బాక్సుల లెక్కింపు జరుగనుంది. 30 సర్కిళ్లలోని 30 ప్రదేశాల్లో లెక్కింపు కేంద్రాల కోసం 150 హాళ్లను సిద్ధం చేశారు. ప్రతి హాల్లోనూ 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్పై 1000 ఓట్ల లెక్కింపు వంతున ఒక రౌండ్లోనే 14 వేల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. నగరంలోని మెజారిటీ డివిజన్లలో 28 వేలలోపు ఓట్లు పోలైన విషయం తెలిసిందే. దాంతో, రెండు రౌండ్లలోనే పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. అన్ని హాళ్లలో గరిష్ఠంగా మూడు రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కానుంది. 11 వేల ఓట్లు పోలైన మెహిదీపట్నం ఫలితం ఒకే రౌండ్లోనే రానుంది.