జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల కొత్త ఎత్తులు
ABN , First Publish Date - 2020-11-30T17:32:22+05:30 IST
మేయర్ పీఠాన్ని దక్కించుకోడానికి ఆయా పార్టీలు అనేక జిమ్మిక్కులకు తెరతీస్తున్నారు.
హైదరాబాద్: మేయర్ పీఠాన్ని దక్కించుకోడానికి ఆయా పార్టీలు అనేక జిమ్మిక్కులకు తెరతీస్తున్నారు. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న అభ్యర్థులు జీహెచ్ఎంసీలో ఓట్లు పొందేందుకు కొత్త ఎత్తులు పన్నుతున్నారు. గూగుల్ పే, పే టీమ్లతో కాకుండా ఏకంగా అకౌంట్లోకే డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఏబీఎన్ చేతిలో ఓటర్ - డిపాజిటర్ ఆడియో క్లిప్ బయటపడింది. జగద్గిరిగుట్ట డివిజన్లో ఓ ఓటర్ అకౌంట్కు రూ.5 వేల నగదు డిపాజిట్ అయ్యింది. అయితే తనకు రూ.5 వేలు అకౌంట్లో పడడంఫై ఓటర్ అవక్కాయ్యాడు. తామే వేశామంటూ బూత్ కమిటీ ఇంచార్జ్.. ఓటరుకు ఫోన్ చేసి మరీ చెప్పారు. ఆయా పార్టీలు ఓటర్ స్లిప్ చూసి అకౌంట్స్కు డబ్బులు వేస్తున్న వైనం నెలకొంది. ప్రత్యక్షంగా నగదు ఇవ్వడంతో గొడవలు వస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు రూట్ మార్చి ఓటర్లు తమకు ఓటు వేసేలా చేసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది.