ట్రాలర్ ఢీకొని బాలిక మృతి
ABN , First Publish Date - 2021-12-08T05:15:23+05:30 IST
తినుబండారాల కోసం రోడ్డు దాటుతున్న ఓ చిన్నారిని ట్రాలర్ ఢీకొంది. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.
పెందుర్తి, డిసెంబరు 7: తినుబండారాల కోసం రోడ్డు దాటుతున్న ఓ చిన్నారిని ట్రాలర్ ఢీకొంది. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన పెందుర్తి- కొత్తవలస రహదారి పాత పెందుర్తి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాత పెందుర్తికి చెందిన మళ్ల సత్తిబాబు,లక్ష్మి దంపతుల కుమారై భావన(7) స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండవ తరగతి చదువుతోంది. మంగళవారం పాఠశాలకు వెళ్లిన ఆ బాలిక ఉదయం విరామ సమయంలో తినుబండారాలు కొనేందుకు బయటకు వచ్చి రోడ్డు దాటుతుండగా కొత్తవలస నుంచి ఐరన్ లోడ్తో వేగంగా వస్తున్న ట్రాలర్ బలంగా ఢీకొంది. దీంతో ఆ బాలిక శరీరం ఛిద్రమైంది. సీఐ అశోక్కుమార్ సంఘటన స్థలానికి చేరు కుని ప్రమాదానికి కారణమైన ట్రాలర్ను పోలీస్ స్టేషన్కు తరలించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.