అర్హులందరికీ నివేశన స్థలాలివ్వాలి
ABN , First Publish Date - 2021-01-21T06:18:26+05:30 IST
అర్హులందరికీ నివేశ స్థలాలు కేటాయించాలని ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మాగంటి వెంకట రామారావు డిమాండ్ చేశారు.
పరిటాల-2 సచివాలయం వద్ద మహిళల ఆందోళన
కంచికచర్ల రూరల్, జనవరి 20 : అర్హులందరికీ నివేశ స్థలాలు కేటాయించాలని ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మాగంటి వెంకట రామారావు డిమాండ్ చేశారు. అర్హత ఉన్నా ఇళ్ల స్థలాలు మంజూరు కాకపోవటాన్ని నిరసిస్తూ పరిటాల-2 సచివాలయం వద్ద ముస్లిం మహిళలు బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం, పార్టీలకతీతంగా స్థలాలు అందిస్తామని సీఎం జగన్ చెబుతుంటే స్థానిక నాయకులు మాత్రం అవన్నీ చూసే స్థలాలు మంజూరు చేస్తున్నారన్నారు. అర్హత ఉన్న వారికి కాకుండా గతంలో స్థలాలు వచ్చిన వారికి, ప్రభుత్వం అందించిన స్థలాలు విక్రయించుకున్న వారికి కూడా స్థలాలు మంజూరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని నచ్చజెప్పటంతో ఆందోళన విరమించారు.