ఘనంగా దసరా
ABN , First Publish Date - 2021-10-17T05:07:36+05:30 IST
జిల్లా అంతటా విజయదశమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. భక్తుల ప్రత్యేక పూజలు, శమీపూజలతో ఆల యాలు కిటకిటలాడాయి.
ఆలయాల్లో శమీపూజ, రావణ, మహిషాసుర సంహార లీలలు
కరీంనగర్, కల్చరల్, అక్టోబరు 16: జిల్లా అంతటా విజయదశమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. భక్తుల ప్రత్యేక పూజలు, శమీపూజలతో ఆల యాలు కిటకిటలాడాయి. పెద్ద సంఖ్య లో భక్తులు ఆలయాలను సందర్శించి వేడుకల్లో పాల్గొన్నారు. శమీపత్రాలను పెద్దలకు, స్నేహితులకు, కుటుంబ స భ్యులకు అందజేసి శుభాకాంక్షలు తెలు పుకున్నారు. భక్తులు వాహన పూజలు చేయించుకున్నారు. పలు చోట్ల ఆలయ ఆవరణల్లో రావణ, మహిషాసుర సంహార లీల కార్యక్రమాలను నిర్వహించారు.
స్టేడియంలో వేడుకలు అదుర్స్..
అంబేద్కర్ స్టేడియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోదసరా వేడుకలు, క్రాకర్స్ షో ఆదుర్స్ అనిపించాయి. వేడుకలను మేయర్ సునీల్రావు, డిప్యూటీమేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తెలంగాణ ఈవెంట్స్ ఇండస్ట్రీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోగుల ప్రసాద్ ద్వారా గాయకులు గీతామాధురి, చిలువేరు శ్రీకాంత్, శ్రీకృతి పాడిన పాటలు, కమెడియన్లు హైపర్ ఆది, రాంప్రసాద్, రైజింగ్ రాజు, బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్, సత్తిపండు, దొరబాబు, గణపతి ప్రదర్శనలు, కేరళ కథాకళి, బోనాలు, జానపద నృత్యం తదితర కార్యక్ర మాలు అలరించాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నగర వాసులు ఆద్యంతం ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో సీపీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గిద్దెపెరుమాండ్ల ఆలయంలో..
గిద్దెపెరుమాండ్ల ఆలయంలో దసరా ఉత్సవాలు, దుర్గా మాత, శమీ పూజలు వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు. ఉదయం మహాగణపతికి అభిషేకాలు జరిగాయి. ఆలయ ప్రాంగ ణంలో జరిగిన శమీపూజ, రాంలీలా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ జీవివీ శ్యాంప్రసాద్లాల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, సీపీ సత్యనారాయణ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రూర ల్ ఏసీపీ విజయసారధి, కార్పొరేటర్లు రవీందర్ సింగ్, ఐలేందర్ యాదవ్, మర్రిభావనాసతీశ్, ఆకుల నర్మద నరసయ్య, లెక్కల స్వప్నా వేణుగోపాల్, కాసర్ల ఆనంద్ కుమార్, మాజీ కార్పొరేటర్ కోడూరి రవీందర్గౌడ్, కలర్ సత్తన్న, ఈవో ఎండపెల్లి మారుతి, అర్చకుడు రామక శంకరశర్మ, గుడికాడి శ్రీనివాస్ పాల్గొన్నారు.
మహాశక్తి ఆలయంలో...
చైతన్యపురి మహాశక్తి ఆలయంలో జరిగిన పూజ ల్లో ఎంపీ, బీజేపి రాష్ట్ర అఽధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు.
ఇల్లందకుంటలో..
ఇల్లందకుంట: మండల కేంద్రంలోని సీతారామ చంద్రస్వామి ఆలయంలో విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సా యంత్రం స్వామి వారి ఉత్సవమూర్తులను గ్రామ వీధుల గుండా ఊరేగించారు. ఆలయంలో శమీ పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో సుధాకర్, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.