వైభవంగా ఆలయ వార్షికోత్సవం

ABN , First Publish Date - 2021-06-24T05:49:34+05:30 IST

కరివేన గ్రామం లోని సుంకుల పరమేశ్వరి ఆలయ వార్షికోత్సవాలను బుధవారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా ఆలయ వార్షికోత్సవం

 ఆత్మకూరు రూరల్‌, జూన్‌ 23: కరివేన గ్రామం లోని  సుంకుల పరమేశ్వరి ఆలయ   వార్షికోత్సవాలను బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా రెండో  రోజైన బుధవారం ఉదయం ఆలయంలో గణపతిపూజ, శ్రీసూక్త పంచామృతాభిషేకాలను నిర్వహించారు. లలితా అష్టోత్తర కుంకుమార్చన పూజలు చేపట్టారు. మధ్యాహ్నం మహిళలు   ఊరేగింపుగా  వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ ఊరేగింపులో భాగంగా మహిళలు గ్రామ శివార్లలోని బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి తరలి వచ్చారు.  



Updated Date - 2021-06-24T05:49:34+05:30 IST