తేనెటీగల దాడి.. 25 జీవాలు మృతి

ABN , First Publish Date - 2020-12-04T05:35:53+05:30 IST

కల్లూరు మండలం రేమడూరు గ్రామంలో తేనెటీగల దాడి చేయడంతో 25 జీవాలు మృతి చెందాయి.

తేనెటీగల దాడి.. 25 జీవాలు మృతి
మృతి చెందిన గొర్రెలు

కర్నూలు, డిసెంబరు 3: కల్లూరు మండలం రేమడూరు గ్రామంలో తేనెటీగల దాడి చేయడంతో 25 జీవాలు మృతి చెందాయి. డోన్‌ మండలం వెంకటనాయునిపల్లికి చెందిన రామాంజినేయులు, మాదన్న, కాంతన్న, నాగే శ్వరరావు రేమడూరు సమీపంలోని నక్కలవాగులో జీవాలు మేపుతున్నారు. గురువారం ఒక్కసారిగా తేనెటీగలు వీరిపై దాడి చేశాయి. దీంతో 25 జీవాలు మృతి చెందాయి. కాంతన్న అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కాంతనన్న చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పశువైద్యాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. 

Updated Date - 2020-12-04T05:35:53+05:30 IST