కరోనా రోగి గదిలోకి వెళ్లకుండానే చికిత్స!
ABN , First Publish Date - 2020-08-05T07:58:15+05:30 IST
కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది వైరస్ బారిన పడకుండా ఉండేలా ఐఐటీ మద్రా్సకు చెందిన నిపుణులు సరికొత్త పరికరాన్ని
- కొత్త పరికరాన్ని రూపొందించిన ఐఐటీ మద్రాస్
చెన్నై, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది వైరస్ బారిన పడకుండా ఉండేలా ఐఐటీ మద్రా్సకు చెందిన నిపుణులు సరికొత్త పరికరాన్ని రూపొందించారు. ఐఐటీ మద్రా్సలోని ఆరోగ్య సంరక్షణ సాంకేతిక పరికరాల తయారీ కేంద్రం (హెచ్ఐటీసీ - హెల్త్కేర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్), ఐఐటీ మద్రాస్ రీసెర్చి పార్కులోని స్టార్టప్ కంపెనీ సంయుక్తంగా ఈ పరికరాన్ని తయారు చేశాయి. దీన్ని కరోనా బాధితుడి వేలికి తగిలిస్తారు. ఆ రోగి శరీర ఉష్ణోగ్రత, ప్రాణవాయువు పరిమాణం, బీపీ వివరాలు మణికట్టుపై ఉన్న డిస్ప్లేలో కనిపిస్తాయి. ఈ వివరాల ఆధారంగా వైద్యులు చికిత్స అందిస్తారు.