కరోనా కట్టడిలో యూపీ ప్రభుత్వం విఫలం: ప్రియాంక గాంధీ

ABN , First Publish Date - 2021-04-23T00:08:57+05:30 IST

కరోనా కట్టడిలో యూపీ ప్రభుత్వం విఫలం: ప్రియాంక గాంధీ

కరోనా కట్టడిలో యూపీ ప్రభుత్వం విఫలం: ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ విమర్శలు గుప్పించారు. యూపీలో కోవిడ్ -19 కేసుల పెరుగుదలపై ప్రియాంక గాంధీ స్పందించారు. యూపీలో పాలన పూర్తిగా వైఫల్యం చెందిందని ఆమె అన్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో యూపీ సర్కారు విఫలమైందని ఆమె పేర్కొంది. ప్రణాళిక, సన్నాహాలు లేనందున పాలనలో అతిపెద్ద వైఫల్యం జరిగిందని, దూరదృష్టి లేదని ప్రియాంక గాంధీ విమర్శించింది. మరో వైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ కోవిడ్ కేసుల ఉద్ధృతి మాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Updated Date - 2021-04-23T00:08:57+05:30 IST