ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2020-02-28T11:17:01+05:30 IST

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం పదర మండల కేంద్రంలో రూ.20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన రెండు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఆయన జడ్పీటీసీ రాంబాబునాయక్‌తో కలిసి ప్రారంభించారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు 

రూ.20 లక్షల వ్యయంతో రెండు ట్రాన్స్‌ఫార్మర్లు ప్రారంబం 

పల్లె నిద్రలో  మండల కేంద్రంలో కాలనీల్లో పర్యటన 


అచ్చంపేట అర్బన్‌ (పదర), ఫిబ్రవరి 27 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం పదర మండల కేంద్రంలో రూ.20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన రెండు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఆయన జడ్పీటీసీ రాంబాబునాయక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకరావాలన్నారు. అనంతరం పలు కాలనీల్లో పర్యటించి కాలనీవాసులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గురువారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమంలో కాలనీల్లో పర్యటించి సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం మండల కేంద్రంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

Updated Date - 2020-02-28T11:17:01+05:30 IST