Kharge : విపక్షం గొంతును నొక్కడానికి ప్రయత్నిస్తున్నారు

ABN , First Publish Date - 2021-08-06T01:39:48+05:30 IST

విపక్ష నేతల గొంతులను నొక్కడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్ని్స్తోందని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే

Kharge : విపక్షం గొంతును నొక్కడానికి ప్రయత్నిస్తున్నారు

న్యూఢిల్లీ : విపక్ష నేతల గొంతులను నొక్కడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్ని్స్తోందని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. తమ గొంతులను నొక్కడానికి ఎంత ప్రయత్నించినా, తాము మాత్రం పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘‘తృణమూల్‌కు చెందిన ఎంపీలు సమస్యల గురించి స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంతలోనే వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. ప్రభుత్వం తమను టార్గెట్ చేసినా, భయపెట్టినా, తమపై ఒత్తిడి పెంచినా, మా గొంతులను నొక్కేసినా... కాంగ్రెస్‌తో సహా విపక్షాలన్నీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’’ అని ఖర్గే స్పష్టం చేశారు. పెగాసస్ విషయంలో ఫ్రాన్స్, ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో ఇప్పటికే విచారణను ప్రారంభించాయని, అయినా మోదీ సర్కార్ ఎందుకు విచారణకు ముందకు రావడం లేదని ప్రశ్నించారు. విచారణకు ముందుకు రాక పోగా, పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్నామని ప్రభుత్వం తమనే విమర్శిస్తోందని ఖర్గే మండిపడ్డారు. 


Updated Date - 2021-08-06T01:39:48+05:30 IST