నేటి నుంచి 6,7,8 తరగతులు ప్రారంభం
ABN , First Publish Date - 2021-02-24T04:42:52+05:30 IST
ప్రభుత్వ ఆదేశాల మేరకు 6,7,8 తరగతులను ప్రారంభించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిజామాబాద్అర్బన్, ఫిబ్రవరి 23 : ప్రభుత్వ ఆదేశాల మేరకు 6,7,8 తరగతులను ప్రారంభించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో ఈ తరగతులను నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పాటు మోడల్ స్కూల్స్, కేజీబీవీ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు అన్నింట్లో తరగతుల నిర్వాహణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. తల్లిదండ్రుల సమ్మతితోనే విద్యార్థులను తరగతులకు హాజరయ్యేవిధంగా చూడాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. తల్లిదండ్రుల సమ్మతి పత్రాలను స్వీకరించి విద్యార్థులను తరగతులకు హాజరయ్యేవిధంగా చూస్తామని డీఈవో దుర్గాప్రసాద్ తెలిపారు. సంబందిత గ్రామాల పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో శానిటైజ్ చేయిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా తరగతులకు హాజరయ్యేవిధంగా ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు.